News March 19, 2025

ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 11, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(<>BOB<<>>) 12 కాంట్రాక్ట్ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC,ST, PwBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in

News November 11, 2025

VZM: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలకు అప్లై చేశారా?

image

సఫాయి కర్మచారి యువతకు 3 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సబ్సిడీపై ఇవ్వనున్నారు.
➤యూనిట్ విలువ: రూ.31,67,326
➤సబ్సిడీ: రూ.14,16,831
➤రుణ మొత్తం: రూ17,50,495, వడ్డీ రేటు: 6%
➤చెల్లింపు కాలం: 72 నెలలు (ప్రతి నెల రూ.33,064 వాయిదా)
➤గ్రూప్: 5 మంది అభ్యర్థులు ఉండాలి
➤అప్లై చేసే స్థలం: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ, మర్రి చెన్నారెడ్డి భవనం, కంటోన్మెంట్, విజయనగరం
➤చివరి తేదీ: 20-11-2025

News November 11, 2025

ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు ఆదాయం: కలెక్టర్

image

జిల్లాలో పంట నష్టాలను తగ్గించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా సిల్వర్ ఓక్‌కు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. కాఫీ తోటలను తెగుళ్ల బెడద నుంచి రక్షించేందుకు అవకాడో, లిచీ, జాక్ ఫ్రూట్, స్వీట్ ఆరంజ్ వంటి విలువైన పంటలను ప్రోత్సహించాలన్నారు. రైతులకు స్థిరమైన ఆదాయం, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పంటలే లక్ష్యం అన్నారు.