News November 24, 2025

ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

image

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 12, 2026

నల్గొండ: మున్సిపల్ పోరులో ‘సింహం’ గర్జిస్తుందా?

image

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో AIFB అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల టికెట్లు దక్కని పలువురు నేతలు ‘సింహం’ గుర్తుపై పోటీకి దిగారు. మొత్తం 48 డివిజన్లలో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున 11 మంది బరిలో నిలవగా, ఐదుగురు అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్నారు. రేపు వెలువడనున్న ఫలితాల్లో సింహం గుర్తు ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని నగరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

News February 12, 2026

నల్గొండ: భారత్ బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

image

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు చేపట్టిన ‘భారత్ బంద్’కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించింది. లేబర్ కోడ్‌ల రద్దు, అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీల్లో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News February 12, 2026

NLG: స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత!

image

నల్గొండ జిల్లా 3 కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద పోలీసులు మూడంచెల భద్రత కల్పించారు. బ్యాలెట్ బాక్సుల వద్ద మొదటి స్టేజీలో తెలంగాణ స్పెషల్ రిజర్వుడ్ పోలీసులతో భద్రత కల్పిస్తుండగా, రెండో స్టేజీలో ఏఆర్ పోలీసులు, మూడో స్టేజీలో సివిల్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.