News November 24, 2025
ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 16, 2026
నల్గొండ: ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయంటే..

ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్కు సంబంధించిన అధికారిక గణాంకాలు వెల్లడయ్యాయి. మొత్తం 2,40,514 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్కు అత్యధికంగా 1,13,149 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ 74,163 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, బీజేపీ 24,479 ఓట్లకు పరిమితమైంది. పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీ ప్రభావం చూపలేకపోయిందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ భారీ మెజార్టీతో ముందంజలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
News February 16, 2026
నల్గొండ: MIMలో చేరిన కార్పొరేటర్

నల్గొండ పురపాలక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 26వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ మొయినా భాయ్ హైదరాబాద్లో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో MIM తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 107 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించిన ఆయన ఇప్పుడు తిరిగి పతంగి గూటికి చేరారు.
News February 15, 2026
నల్గొండ: గ్రామీణ ప్రతిభకు ‘సీఎం కప్’ వేదిక: కలెక్టర్

గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే ‘సీఎం కప్’ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఈ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. సరైన వేదికలు లేక వెనుకబడుతున్న గ్రామీణ క్రీడాకారులకు ఇది గొప్ప అవకాశమని, పట్టుదలతో ఆడి జిల్లాకు కీర్తి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రీడా శాఖ అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


