News November 24, 2025

ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

image

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 20, 2026

NLG: ఎన్నికల ఖర్చులో చేతివాటం!

image

జిల్లాలో ఎన్నికలు ముగిసిన తరుణంలో ఇప్పుడు ఖర్చుల లెక్కలపై చర్చ మొదలైంది. ఎన్నికల నిర్వహణ పేరుతో అయ్యే వ్యయంపై సరైన ఆడిట్ వ్యవస్థ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఎన్నికల ఖర్చులను భారీగా పెంచి చూపి, వ్యక్తిగత లాభం పొందిన ఘటనలున్నాయి. ఎన్నికల ఖర్చులపై ఆడిట్ లేకపోవడంతో రూ.లక్షల్లో దుర్వినియోగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News February 20, 2026

నల్గొండ: మున్సిపాలిటీల్లో ‘కోఆప్షన్’ కోలాహలం

image

జిల్లాలోని మున్సిపాలిటీల్లో నూతన పాలక వర్గాల ఏర్పాటు ప్రక్రియ ముగియడంతో, రాజకీయ సమీకరణాలు ఇప్పుడు కోఆప్షన్ సభ్యుల భర్తీ చుట్టూ తిరుగుతున్నాయి. పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ పదవులను దక్కించుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకులు, ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు, పార్టీ కోసం కష్టపడిన వారు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.

News February 20, 2026

నల్గొండ: ప్రభుత్వ బడి విద్యార్థులకు ‘రవాణా’ భరోసా

image

మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే విద్యార్థుల కోసం ఉద్దేశించిన రవాణా భత్యం నిధులను రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం తాజాగా విడుదల చేసింది. జిల్లాలో అర్హులైన ప్రతి విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నుంచి మార్చి వరకు నిధులను విడుదల చేసింది