News August 13, 2024
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో ఏయూకు 41వ స్థానం

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఏయూకు ఓవరాల్ విభాగంలో జాతీయస్థాయిలో 41వ స్థానం లభించింది. స్టేట్ యూనివర్సిటీ విభాగంలో జాతీయస్థాయిలో 7వ ర్యాంకును, విశ్వవిద్యాలయాల విభాగంలో 25వ స్థానాన్ని సాధించింది. గత ఏడాది కంటే మెరుగైన స్థానాన్ని ఏయూ సాధించడం పట్ల ఏయూ ఇన్ ఛార్జ్ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు సంతోషం వ్యక్తం చేశారు. పలు ఐఐటీలు, ఎన్ఐటీలకంటే ఏయు మెరుగైన ర్యాంకింగ్ తో ముందంజలో నిలిచింది.
Similar News
News July 7, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

కోటబొమ్మాలి రైల్వే లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తే డివిజన్ డీసీఎం సందీప్ సోమవారం తెలిపారు. విశాఖ -గుణుపూర్ (58505/06), విశాఖ -బరంపూర్ (58531/32), విశాఖ -భువనేశ్వర్ ఇంటర్ సిటీ (22819/20), విశాఖ- పలాస ప్యాసింజర్ (67289/90), విశాఖ -బరంపూర్ ఎక్స్ప్రెస్ (18525/26) రైళ్ళు జూలై 11న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.
News July 7, 2025
విశాఖ: ‘రాందేవ్ బాబాకు భూ కేటాయింపులు ఆపండి’

జీఓ 596కు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసిన 6లక్షల ఎకరాల భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి ఎస్సీలకే కేటాయించాలని విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేశారు. శారదా పీఠం నుండి తీసుకున్న భూములు రామ్ దేవ్ బాబాకు ఇవ్వొద్దని, ఉమ్మడి విశాఖ జిల్లాలో భూ కుంభకోణాలపై వేసిన రెండు సిట్ల నివేదికలూ బయట పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News July 7, 2025
విశాఖ: వైసీపీ ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిపై మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేయగా బెయిల్ మంజూరు అయింది. గత నెల 23వ తేదీన నిర్వహించిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో ఆమె పాల్గొనడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నోటీసులు ఇవ్వడంతో ఇవాళ మహారాణిపేట సీఐ భాస్కరరావు ఎదుట ఆమె విచారణకు హాజరయ్యారు. కోర్టు మంజూరు చేసిన బెయిల్ పత్రాలను సీఐకు సమర్పించారు.