News January 2, 2026
ఎన్గల్ గ్రామ శివారులో చిరుత సంచారం..?

చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. రెండు రోజుల కింద హన్మాజీపేట శివారులోని రైస్ మిల్ వద్ద చిరుతపులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించి, చిరుత సంచారం నిజమేనని నిర్ధారించారు. ఈ క్రమంలో ఎన్గల్ గ్రామ శివారులో చిరుత సంచరించడం గమనించినట్లు ప్రచారం జరగడంతో గ్రామస్థులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
Similar News
News January 31, 2026
నిధుల లేమితో నిలిచిన సత్తుపల్లి-కొవ్వూరు రైల్వే పనులు

భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వే లైను అందుబాటులోకి వచ్చినా, సత్తుపల్లి-కొవ్వూరు మార్గం నిధుల కేటాయింపు లేక పెండింగ్లో పడింది. 119కి.మీల ఈ మార్గం పూర్తయితే సరుకు, ప్రయాణికుల రవాణాకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది. ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వం, కేంద్రం చొరవ చూపి నిధులు కేటాయించాల్సి ఉంది. రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానతను పెంచే ఈప్రాజెక్టుపై కేంద్ర బడ్జెట్లో స్పష్టత రావాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
News January 31, 2026
మహబూబాబాద్: ఇండిపెండెంట్ అభ్యర్థులకు 75 గుర్తులు

మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం 75గుర్తులను కేటాయించింది. మహబూబాబాద్ జిల్లాలో పోటీ చేసే ఇండిపెండెంట్ అభ్యర్థులు వీటి నుంచి ఒక గుర్తును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ జాబితాలో చపాతీ రోలర్, బ్యాట్, బ్యాటరీ టార్చ్, గ్యాస్ సిలిండర్, కుండ, కెమెరా, పండ్ల బుట్ట, పచ్చిమిర్చి, ఉంగరం వంటి ఆకర్షణీయమైన గుర్తులు ఉన్నాయి. అభ్యర్థుల తుది జాబితా అనంతరం ఈ గుర్తులను కేటాయించనున్నారు.
News January 31, 2026
సికింద్రాబాద్లో ‘దొంగ’ ప్లాన్ వేశాడు.. పోలీసులకు దొరికాడు!

నకిలీ కలర్ జిరాక్స్ నోట్లను ATM మెషిన్లో డిపాజిట్ చేసిన వ్యక్తి అరెస్టైన సంఘటన మహంకాళి PS పరిధిలో చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్కి చెందిన షేక్ మోసిన్ రెజిమెంటల్బజార్లోని ఓ లాడ్జిలో ఉంటూ నకిలీ కలర్ జిరాక్స్ నోట్లను ప్రింట్ చేసి ఏటీఎం మిషన్లో డిపాజిట్ చేసాడు. అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కావడం లేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసలు విషయం బయటపడడంతో షేక్ మోసిన్ను అరెస్ట్ చేశారు.


