News October 1, 2025
ఎన్టిఆర్ భరోసా పింఛన్లు అందించిన కలెక్టర్

ఎన్టిఆర్ భరోసా పింఛన్లు సజావుగా పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం 35వ వార్డులో బుధవారం ఎన్టిఆర్ భరోసా పింఛన్లు కలెక్టర్ పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా, లేదా అంటూ ఆరా తీశారు.
Similar News
News October 1, 2025
తణుకు: అదృశ్యం కేసులో వీడని ఉత్కంఠ..గాలింపు చర్యలు ముమ్మరం

తణుకులో అదృశ్యమైన మడుగుల సురేష్ వ్యవహారంలో ఉత్కంఠ వీడడం లేదు. పోలీసుల విచారణలో నిందితులు హత్య చేసినట్లు అంగీకరించినప్పటికీ మృతదేహాన్ని ఏం చేశారనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు తణుకులోని గోస్తని నదితో పాటు చించినాడ వద్ద గోదావరి తీరంలో సురేష్ మృతదేహం కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సురేష్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు.
News October 1, 2025
అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: మంత్రి వర్మ

కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద బ్యాంకులు లబ్ధిదారులకు విరివిగా రుణాలు మంజూరు చేసి పేద వర్గాలకు ఆర్థికంగా చేయూత నివ్వాలన్నారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్ పాల్గొన్నారు.
News September 30, 2025
నరసాపురం తీరంలో విషపుటీగల గూడులు

నరసాపురం తీర ప్రాంతంలో విషపుటీగల గూడులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడప గ్రామంలో భార్యభర్తలపై ఇవి దాడి చేశాయి. 2004 సునామీ తరువాత సముద్రం మీదగా నరసాపురం తీర ప్రాంతానికి వచ్చిన ఈ విషపు ఈగలు పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో తిష్ట వేశాయి. గతంలో పేరుపాలెం, పెదమైనవానిలంక గ్రామంలో వీటి దాడిలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.