News July 10, 2025
ఎన్టీఆర్: ఈ నెల 12తో ముగియనున్న గడువు

ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఛార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు (కాంట్రాక్ట్) అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు. ఈ నెల 12లోపు అభ్యర్థులు తమ కొటేషన్లను విజయవాడలోని కలెక్టర్, JC కార్యాలయంలో అందజేయాలన్నారు. మూడేళ్ల అనుభవం ఉండి అకౌంటింగ్ సిస్టమ్స్, టూల్స్ ప్రొఫిషయన్సీ, ఫైలింగ్ తదితర అంశాలలో పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.
Similar News
News July 10, 2025
జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో అక్షరాంద్ర కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అక్షరాంద్ర ఉల్లాస్-2 కార్యక్రమంపై జిల్లాస్థాయి అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. అక్షరాంద్ర కార్యక్రమం ద్వారా 1,00,586 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు.
News July 10, 2025
పెన్ పహాడ్: విద్యుత్ షాక్తో రైతు మృతి

పెన్ పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో విద్యుత్ షాక్కు గురై చికిత్స పొందుతూ రైతు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొంతగాని నాగయ్య (45) ట్రాన్స్ ఫార్మర్ ఆన్ చేస్తూ విద్యుత్ షాక్ తగలడంతో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News July 10, 2025
విశాఖ రైల్వే స్టేషన్లో త్వరలో క్యాప్సూల్ హోటల్

విశాఖ రైల్వే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫారం మొదటి అంతస్తులో త్వరలో క్యాప్సూల్ హోటల్ను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు DRM లలిత్ బోహ్ర గురువారం తెలిపారు. మొత్తం 88 రూమ్లతో కలిగిన హోటల్లో ప్రత్యేకంగా 18 రూములు మహిళలకు మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ బెడ్లు 3 గంటల వరకు రూ.200, 3-24 గంటల వరకు రూ.400, డబుల్ బెడ్లు 3 గంటల వరకు రూ.300, 3-24 గంటలకు రూ.600 అద్దె ఉంటుందన్నారు.