News January 31, 2025

ఎన్టీఆర్: ఏ.కొండూరులో 20 మంది అరెస్ట్ 

image

ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు (మ) చీమలపాడులో కోడిపందేల శిబిరంపై గురువారం ఎస్ఐ చల్లా కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో 20 మంది పందేం రాయుళ్లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఒక కోడిపుంజు, కోడి కత్తి, రూ.24,450 నగదును సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కానిస్టేబుల్స్ ప్రేమ్ కుమార్, తిరుపతిరావు, బాబురావు ఉన్నారు. 

Similar News

News February 25, 2026

GNT: జాబ్ మేళాలతో లక్ష మందికి ఉద్యోగాలు

image

సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి లోకేశ్ శాసనసభలో తెలిపారు. ఇందుకోసం క్లస్టర్ బేస్డ్ విధానంతో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ కల్పన చేపడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జాబ్ మేళాల ద్వారా 1.08 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.

News February 25, 2026

నల్గొండ జిల్లాలో ముగ్గురు వైద్యులపై వేటు

image

రాష్ట్రంలో విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న 94 మంది వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నల్గొండ జిల్లాకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రియదర్శిని, మాధురి, శ్రీవిద్య మాధ ఉన్నారు.

News February 25, 2026

భద్రత కల్పించాలన్న కాటసాని పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

image

తనకు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాటసాని రాంభూపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం పోలీసు భద్రతనేది హోదాగా మారిందని, దానికి ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలని CJI ధర్మాసనం కాటసాని లాయర్‌ను ప్రశ్నించింది. శక్తిమంతులైన మీరు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. మీకు ముప్పు ఉంటే నిఘా వ్యవస్థలు అంచనా వేస్తాయని పేర్కొంది.