News March 1, 2025
ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్ పరీక్షకు 958 మంది గైర్హాజరు

శనివారం తొలిరోజు జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తెలుగు/సంస్కృతం/హిందీ/ఉర్దూ పరీక్షకు 40,695 మందికి గాను 39,737 మంది హాజరయ్యారు. 958 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదు. నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు పలు సిటింగ్ స్క్వాడ్ స్ విధుల్లో పాల్గొన్నాయి.
Similar News
News March 1, 2025
ఇది ప్రభుత్వం కాదు సర్కస్: KTR

TG: SLBC ఘటనపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా ప్రకటన చేస్తున్నారని KTR మండిపడ్డారు. 8 మంది కార్మికుల ఆచూకీపై అధికారిక ప్రకటన చేయాలని CM రేవంత్ను డిమాండ్ చేశారు. ‘మృతదేహాలను గుర్తించామని ఒకరు, PM సంతాపం తెలపలేదని మరో MLA అంటున్నారు. ఇది సర్కస్లా ఉంది. కనీసం ఒక్కరైనా బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు. ఇదేనా మీరు కార్మికులకు ఇచ్చే గౌరవం? ఇదేనా మీ ప్రభుత్వంలో ప్రాణాలకుండే విలువ?’ అని ప్రశ్నించారు.
News March 1, 2025
విడాకుల వార్తలపై నటుడి భార్య స్పందనిదే

ప్రముఖ నటుడు, రాజకీయ నేత గోవిందాతో <<15584416>>విడాకుల<<>> వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎవరూ విడదీయలేరని, అలాంటి వారు ఎవరైనా ఉంటే తన ముందుకు రావాలన్నారు. ‘పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. మేం ఇంట్లో ఉంటే షార్టులు ధరించి తిరుగుతుంటాం. గోవిందా రాజకీయాల్లో ఉండటంతో ప్రముఖులు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఆయన మరో చోట అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నారు’ అని చెప్పారు.
News March 1, 2025
WNP: దివ్యాంగులందరూ యూడిఐడి కలిగి ఉండాలి: కలెక్టర్

దివ్యాంగులందరూ యూడిఐడి(యూనిక్ డిజేబుల్ ఐడి) కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఐడిఓసి సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న దివ్యాంగులకు అందరికీ యూడీఐడీ కలిగి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అందుకు సంబంధించి జిల్లాలోని సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు.