News July 20, 2024
ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు: DEO

ఎన్టీఆర్ జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో యూవీ. సుబ్బారావు శనివారం ఉదయం తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు స్పష్టం చేశారు. కావున ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు గమనించాలని పేర్కొన్నారు.
Similar News
News January 29, 2026
ఉప్పెన బిడ్డ.. వేల కోట్ల అధిపతి!

నాగాయలంక (M)కి చెందిన బొండాడ రాఘవేంద్రరావు జీవితం స్ఫూర్తిదాయకం. దివిసీమ ఉప్పెనలో అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబంలో పుట్టిన ఆయన కష్టపడి చదివి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. L&T, ఆస్టర్ టెలికామ్లో కీలక పదవులు నిర్వహించిన ఆయన 2011లో బొండాడ ఇంజినీరింగ్స్ను స్థాపించారు. టెలికామ్, విద్యుత్ రంగాల్లో విస్తరించి నేడు రూ. 7500 కోట్ల మార్కెట్ విలువతో హురూన్ సంపన్నుల జాబితాలో చోటు దక్కింది.
News January 28, 2026
కృష్ణా: పవన్ కళ్యాణ్తో ఎంపీ బాలశౌరి భేటీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ను ఎంపీ కలిశారు. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు పనులు, నియోజకవర్గ సమస్యలను పవన్ దృష్టికి బాలశౌరి తీసుకెళ్లారు.
News January 28, 2026
ఉప్పులూరు ఆసుపత్రిలో DMHO ఆకస్మిక తనిఖీ

ఉప్పులూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. DMHO యుగంధర్ ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా, ఒక సామాన్యుడిలా ఆసుపత్రికి వచ్చారు. నేరుగా వెయిటింగ్ హాల్లోకి వెళ్లి, అక్కడ చంటిబిడ్డతో కూర్చున్న ఒక తల్లి వద్దకు వెళ్లి.. వైద్య సేవలపై అని ఆరా తీశారు. అనంతరం ఆయన లోపలికి వెళ్లి రిజిస్టర్లు, OP రికార్డులు పరిశీలిస్తుండగా, చూసిన సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.


