News June 10, 2024
ఎన్టీఆర్ జిల్లాలో 12వ తేదీన ట్రాఫిక్ మళ్లింపు

గన్నవరంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా 12వ తేదీన జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు గామన్ బ్రిడ్జి- దేవరపల్లి- జంగారెడ్డిగూడెం- అశ్వరావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందన్నారు. హనుమాన్ జంక్షన్ నుండి వచ్చే వాహనాలు నూజివీడు- మైలవరం- ఇబ్రహీంపట్నం- నందిగామ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందన్నారు.
Similar News
News February 10, 2026
కృష్ణా: సంక్షోభంలో ఇటుక పరిశ్రమ..!

కృష్ణా జిల్లాలో ఇటుక పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు మందగించడంతో ఇటుకలకు గిరాకీ పూర్తిగా పడిపోయింది. లక్షల ఇటుకలు నిల్వ ఉన్నా కొనేవారు లేరు.. అప్పులు తెచ్చి బట్టీలు నడుపుతున్నాం అని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. అమ్మకాలు లేక, ఆదాయం రాక వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
News February 9, 2026
మచిలీపట్నంలో ‘వందేమాతరం’ కోస్టల్ సైక్లోథాన్ ప్రారంభం

మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో CISF ఆధ్వర్యంలో సోమవారం ‘వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్-2026’ మెగా సైకిల్ ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. దేశ రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ సుమారు 6,500 కి.మీ మేర సాగే ఈ భారీ యాత్రను అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. తీర ప్రాంత భద్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం.
News February 9, 2026
కృష్ణా: పీజీఆర్ఎస్కు 152 అర్జీలు

కృష్ణా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 152 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పరిష్కార చర్యల నిమిత్తం బదిలీ చేశారు. పంచాయతీ రాజ్కు సంబంధించి అధిక అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.


