News February 21, 2025

ఎన్టీఆర్ జిల్లా టుడే టాప్ న్యూస్

image

1.మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఇద్దరికి కఠిన కారాగార శిక్ష. 2. అమలాపురం లాడ్జిలో విజయవాడ వైద్యుడు మృతి. 3. పీఎం సూర్యఘర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి: కలెక్టర్ లక్ష్మిశ. 4. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలసిన ఎంపీ చిన్ని. 5. మైలవరంలో కరెంట్ షాక్ కొట్టి బాలుడి మృతి. 6. వైసీపీ నేత వంశీ పిటిషన్లపై వచ్చే వారానికి వాయిదా పడ్డ విచారణ. 7. విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు.

Similar News

News December 31, 2025

2025 క్రైమ్ రిపోర్టు: హత్యలు 54, కిడ్నాప్‌లు 25

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 2025లో మొత్తం 4,028 కేసులు నమోదయ్యాయని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే నేరాలు 2 శాతం పెరిగాయని చెప్పారు. రోడ్డు ప్రమాద మరణాలు 340 నుంచి 303కు తగ్గాయి. హత్యలు 54, కిడ్నాప్‌లు 25గా నమోదయ్యాయి. మహిళలపై నేరాలు 26.3 శాతం పెరిగాయి. ఈ-చలాన్ల ద్వారా రూ.1.01 కోట్ల జరిమానా వసూలు చేశారు. హిందూపురం బ్యాంకు చోరీ కేసులో రూ.5.5 కోట్ల బంగారాన్ని పోలీసులు <<18718838>>రికవరీ<<>> చేశారు.

News December 31, 2025

REWIND-2025: విశాఖ అభివృద్ధిలో కీలక మలుపు

image

2025లో ఉమ్మడి విశాఖ అభివృద్ధి దిశగా కీలక మలుపు తిరిగింది. ఐటీ, పరిశ్రమలు, మౌలిక వసతుల పరంగా రాష్ట్ర ఆర్థిక పటంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ ఏడాది విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన అంశంగా గూగుల్ డేటా సెంటర్ ప్రకటన నిలిచింది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదిత మిట్టల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమల రంగంలో కొత్త ఆశలు రేపింది. మొత్తంగా 2025 విశాఖ అభివృద్ధి పునాదులు వేసిన ఏడాదిగా నిలిచింది.

News December 31, 2025

వర్ధన్నపేట ఎమ్మెల్యే పేరుతో సైబర్ వల..!

image

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ఆయన పోలీస్ అధికారిగా ఉన్న సమయంలోని ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు, ఫ్రెండ్ లిస్ట్‌లోని వారితో చాట్ చేసి మొబైల్ నంబర్లు సేకరిస్తున్నారు. అనంతరం వాట్సాప్‌లో సంప్రదించి డబ్బులు పంపాలని బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు బాధితులు డబ్బులు పంపినట్టు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.