News July 7, 2025
ఎన్టీఆర్: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీ.ఏ, బీ.కామ్, బీ.బీ.ఏ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 30-ఆగస్టు 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుపుతామని, పూర్తి వివరాలకు సంబంధిత స్టడీ సెంటర్లో సంప్రదించాలని కోరింది.
Similar News
News July 7, 2025
అర్జీలు స్వీకరించిన కడప ఎంపీ

పులివెందులలోని తన నివాసంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు.
News July 7, 2025
ఐసెట్ ఫలితాలు విడుదల

TG: ఐసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ను అందరికంటే ముందుగా, వేగంగా, సులభంగా Way2Newsలో పొందవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్పై హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ వచ్చేస్తాయి. APలోని NTR జిల్లాకు చెందిన క్రాంతికుమార్ తొలి ర్యాంక్, TGలోని కామారెడ్డి జిల్లాకు చెందిన సాయికృష్ణ 2వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. 64,938 మంది పరీక్ష రాయగా 58,985(90.83%) మంది ఉత్తీర్ణత సాధించారు.
News July 7, 2025
వరంగల్: క్వింటా పసుపు రూ.12,659

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటాకి రూ.2,400 పలకగా.. పసుపు రూ. 12,659 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.6050 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,850 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.