News April 25, 2025

ఎన్టీఆర్: పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి.. 3ఏళ్ల కఠిన కారాగార శిక్ష 

image

మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన డేవిడ్ పవన్ కుమార్(37) అనే వ్యక్తిపై కృష్ణలంక పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విజయవాడ పోస్కో కోర్ట్ జడ్జి వి.భవాని గురువారం విచారించారు. డేవిడ్ పవన్ కుమార్ నేరం చేసినట్లు రుజువైనందున నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. 

Similar News

News April 25, 2025

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవస్థలు కుదేలు: శ్రీనివాస్ గౌడ్

image

మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం ఈరోజు జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని సంక్షేమ పథకాల అమలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలందరూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చలో వరంగల్ సభను విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్సీ, నాయకులు పాల్గొన్నారు.

News April 25, 2025

పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. షా ఆదేశాలు

image

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ఇప్పటికే పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేేపట్టారు.

News April 25, 2025

ఆర్మీ కంటపడ్డాడు.. ఖతమయ్యాడు

image

లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భారత సైన్యం <<16209767>>మట్టుబెట్టిన<<>> విషయం తెలిసిందే. పహల్గామ్ దాడి నిందితుల కోసం ఆర్మీ, J&K పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టగా అల్తాఫ్ వారి కంటపడ్డాడు. దీంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీ ఫైరింగ్‌లో అల్తాఫ్ హతమయ్యాడు. అటు కశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఆర్మీ చీఫ్ ద్వివేది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

error: Content is protected !!