News April 23, 2025
ఎన్టీఆర్: ప్రధాని మోదీ పర్యటనకు 120 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాట్లు

మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా CRDA అధికారులు విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. సెక్రటేరియట్ సమీపంలో సభ జరిగే ప్రాంగణాన్ని 28 ఎకరాల్లో అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్టేజి వెనుక 10 ఎకరాలు, సమీపంలో 32 ఎకరాలలో VIPల వాహనాల పార్కింగ్కు స్థలం చదును చేసి సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలు తరలి వచ్చే బస్సులకు 110 ఎకరాలలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
Similar News
News April 23, 2025
మద్యం కుంభకోణంలో మరో నిందితుడు అరెస్ట్

AP: మద్యం కుంభకోణం వ్యవహారంలో పోలీసులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ స్కామ్కు సంబంధించి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కాగా, తాజాగా A8 చాణక్యను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, రాజ్ కసిరెడ్డి విచారణలో పూర్తి వివరాలు వెల్లడించలేదని సిట్ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
News April 23, 2025
కుల్గాంలో భీకర ఎన్కౌంటర్.. TRF కమాండర్ ట్రాప్

జమ్మూ కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కుల్గాంలోని టంగ్మార్గ్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పహల్గామ్ దాడికి కారణమైన TRF ఉగ్రవాదుల కమాండర్ అసిఫ్ ఫౌజీని ట్రాప్ చేశారు. టెర్రరిస్టులు తలదాచుకున్న ప్రాంతాన్ని అన్నివైపుల నుంచి బలగాలు చుట్టుముట్టాయి. కాగా ఈ దాడుల్లో అసిఫ్ ఫౌజీ నేరుగా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
News April 23, 2025
కామారెడ్డి: నెలవారీ నేర సమీక్ష

కామారెడ్డి జిల్లా SP రాజేశ్ చంద్ర జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. SP మాట్లాడుతూ.. పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమితికి లోబడి ఉండాలని, గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ విషయంలో SOP కూడళ్లలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.