News March 20, 2025

ఎన్టీఆర్: బీటెక్ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో DEC 2024లో నిర్వహించిన బీటెక్ 1వ సెమిస్టర్ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మార్చి 24వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సీటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. 

Similar News

News March 20, 2025

పార్వతీపురం: ‘నాణ్యమైన జీడిపప్పును కొనుగోలు చేయాలి’

image

వన్ ధన్ వికాస్ కేంద్రాల (వీడివీకె) సభ్యులు జిల్లాలో నెలకొల్పే జీడి పరిశ్రమలకు నాణ్యమైన జీడిపప్పును రైతుల నుంచి కొనుగోలు చేసుకునేలా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులకు సూచించారు.పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే జీడి పప్పును ముందుగా సిద్ధం చేసుకోవాలని అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సబ్ కలెక్టర్లు, ఏపీఎంలు,ఉద్యానవన శాఖ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News March 20, 2025

IPL ట్రోఫీ కోసం PBKS ప్రత్యేక పూజలు!

image

మరో రెండ్రోజుల్లో IPL మొదలు కానుండటంతో అన్ని జట్లు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారి కప్ తమకే రావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించింది. టీమ్ కోచ్ రికీ పాంటింగ్, కోచింగ్ సిబ్బంది, ప్లేయర్లంతా కలిసి పూజలో పాల్గొన్నారు. 2008 నుంచి ఆడుతున్నప్పటికీ పంజాబ్ ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేదు. మరి పూజతోనైనా జట్టు తలరాత మారుతుందో చూడాలి.

News March 20, 2025

రేవంత్‌కు పర్సెంటేజీలపైనే ఇంట్రెస్ట్: కేటీఆర్

image

TG: రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘ఆయనకు అదృష్టం బాగుంది.. పర్సనాలిటీ పెంచుకుంటారనుకున్నా. అయితే పర్సెంటేజీలపైనే రేవంత్‌కు ఆసక్తి ఉంది. ఢిల్లీకి మూటలు పంపి పదవి కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు’ అని విమర్శించారు. సూర్యాపేట సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఫీనిక్స్ ప‌క్షిలా పోరాటం చేస్తున్నార‌ని KTR ప్రశంసించారు.

error: Content is protected !!