News March 21, 2024

ఎన్టీఆర్: బీసీ మంత్రం పని చేసేనా.?

image

మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిని బరిలోకి దించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో జగన్ తిరుపతిని ఎంపిక చేశారు. 2014లో సైతం జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్‌కు మైలవరంలో అవకాశమివ్వగా ఆయన దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024లో మైలవరంలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లా మొత్తం ఆసక్తి నెలకొంది.

Similar News

News February 17, 2026

కృష్ణా: ఈ దృశ్యం..ఏం చెబుతోంది?

image

కృష్ణా జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం-విజయవాడ 216 జాతీయ రహదారిపై గూడూరు సెంటర్ వద్ద ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గూడూరు పోలీసులు మంగళవారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టాన్ని అర్థమయ్యే విధంగా, యాక్సిడెంట్‌లో నుజ్జునుజ్జు అయిన వాహనాన్ని ఆ మార్గంలో ఉంచి వారికి అవగాహన కల్పిస్తున్నారు.

News February 16, 2026

కృష్ణా: రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. మచిలీపట్నం-విజయవాడ NHపై వేగ నియంత్రణల కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములు రాత్రి పూట కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే డ్రమ్ములకు రేడియం స్టిక్కర్లు వేయాలని ఆదేశించారు.

News February 16, 2026

PGRSలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: DRO

image

PGRSలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కార మార్గం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్టణం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.