News November 1, 2025
ఎన్టీఆర్: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలోని కళాశాలల్లో జులై, ఆగస్టు 2025లో నిర్వహించిన ఎం.ఏ 1,2,4వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు నవంబర్ 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ. 960 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, వివరాలకు https://anucde.info/ResultsJAug25.asp చూడాలని వర్సిటీ తెలిపింది.
Similar News
News November 1, 2025
ఒకే ఇంట్లో ఆరుగురికి పింఛన్.. ₹36వేలు అందజేత

అనంతపురంలోని 26వ డివిజన్ హమాలీ కాలనీలో ఒకే ఇంట్లో ఆరుగురు దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. సయ్యద్ కుటుంబంలోని ఆరుగురు (సయ్యద్, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, మనుమడు) మూగవారు కావడంతో, వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున పింఛను మంజూరు చేస్తోంది. శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారందరికీ పింఛన్లను అందజేశారు. రూ.36వేలు అందించారు.
News November 1, 2025
పలాసకే తలమానికంగా నిలిచిన గుడి ఇది!

కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వందలాది దేవతామూర్తుల విగ్రహాలతో <<18168511>>హరిముకుందా పండా అద్భుతంగా నిర్మించారు<<>>. తిరుమల శ్రీవారి విగ్రహంలా 9అడుగుల ఏకశిల విగ్రహాన్ని తిరుపతి నుంచే తెప్పించి ప్రతిష్ఠ చేశారు. పలాసకే ఈ గుడి తలమానికంగా నిలిచింది. దీంతో భక్తులు భారీగా ఆలయానికి వస్తుంటారు. హరిముకుంద ఒడియా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆలయంలో ప్రత్యేకతలు ఒడిశా సంప్రదాయానికి దగ్గరగా ఉంటాయి.
News November 1, 2025
GNSS కడప స్పెషల్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్

GNSS స్పెషల్ కలెక్టర్గా విధులు నిర్వహించిన నీలమయ్య రిలీవ్ అయ్యాడు. ఆ స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ను అదనంగా స్పెషల్ కలెక్టర్గా కేటాయించారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఛాంబర్లో కడప స్పెషల్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్ బాధ్యతలను స్వీకరించారు.


