News March 28, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు శుభవార్త

విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB)-కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC-HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News November 12, 2025
జుబేదాకు అండగా మంత్రి లోకేశ్

మస్కట్లో ఇబ్బందులు పడుతున్న గుంతకల్లుకు చెందిన <<18239340>>జుబేదా<<>>కు అన్నివిధాలా సహాయం అందించి, సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ తెలిపారు. తాను మస్కట్లో ఇబ్బందులు పడుతున్నట్లు జుబేదా ఇటీవల సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. తాను అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానన్నారు. ఆమె సురక్షితంగా తిరిగి వచ్చేవరకు అండగా ఉంటామని ‘X’లో పోస్టు చేశారు.
News November 12, 2025
ASF: ‘కిసాన్ కాపాస్ యాప్ని రద్దుచేయాలి’

సీసీఐ నిబంధనలను సడలించి, కిసాన్ కాపాస్ యాప్ని రద్దుచేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతీ అన్నారు. జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. తేమ పరీక్ష లేకుండా ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసారి వాతావరణ దుష్ప్రభావం దండిగానే పడిందన్నారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి చెట్లకు ఖాతా, పూత విపరీతంగా రాలిపోయి పంట కేవలం 20% నుంచి 30% మాత్రమే దిగుబడి వచ్చేలా ఉందన్నారు.
News November 12, 2025
ఖమ్మం జిల్లాలో 10 నెలల్లో రూ. 14 కోట్లు దోపిడీ

ఖమ్మం జిల్లాలో సైబర్ మోసాలు హడలెత్తిస్తున్నాయి. గత 10 నెలల్లోనే వివిధ పోలీస్ స్టేషన్లలో 330కి పైగా కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్లు జిల్లా వాసుల నుంచి ఏకంగా రూ. 14 కోట్లు దోచుకున్నారు. నష్టపోయిన 24 గంటల్లో ఫిర్యాదు చేయడంతో రూ. 4 కోట్లు రికవరీ అయింది. కొరియర్ వచ్చిందంటూ ఓటీపీ చెప్పించడం ద్వారానే ఎక్కువ మోసాలు జరిగాయి.


