News October 27, 2025
ఎన్టీఆర్: వాయిదా పడిన కేంద్ర మంత్రి నిర్మల అమరావతి పర్యటన

అమరావతిలో మంగళవారం జరగాల్సిన బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది. కార్యక్రమం జరిగే తదుపరి తేదీ తెలియాల్సి ఉంది. కాగా ఉద్దండరాయునిపాలెంలో 12 బ్యాంకులకు CRDA స్థలాలు కేటాయించగా..శంకుస్థాపన జరిగిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
Similar News
News October 27, 2025
మొంథా తుఫాన్.. విద్యుత్ శాఖ నుంచి కీలక ప్రకటన

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో NTR జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఉప్పలపాటి హనుమయ్య సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
విజయవాడ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయం: 9440817561
విజయవాడ టౌన్ డివిజన్ కార్యాలయం: 7382623226
గుణదల డివిజన్: 6281703087
విజయవాడ రూరల్: 6281705138
నూజివీడు డివిజన్:8125533788.
News October 27, 2025
అమరావతికి ‘వైకుంఠపురం’ రక్షణ కవచం

రాజధాని అమరావతికి వైకుంఠపురం ఒక పెద్ద రక్షణ కవచంగా పనిచేస్తుంది. కృష్ణా నది వరద సమయంలో పడమర నుంచి తూర్పు దిశగా ప్రవహించి, వైకుంఠపురంలోని కొండ దగ్గర తన దిశను ఉత్తరం వైపునకు మార్చుకుంటుంది. ఉత్తర, దక్షిణ దిక్కులలో ఉన్న కరకట్టల కారణంగా వరద నీరు వైకుంఠపురంలోకి రాదు. ఒకవేళ వరద నీరు గ్రామంలోకి వస్తే, రాజధానిలోని గ్రామాలు ముంపునకు గురవడమే కాక, కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
News October 27, 2025
మహిళా క్రికెటర్లపై దాడి.. మంత్రి వ్యాఖ్యలతో దుమారం

AUS మహిళా క్రికెటర్లను ఓ వ్యక్తి <<18103257>>అసభ్యంగా<<>> తాకిన ఘటనపై MPకి చెందిన మంత్రి విజయ్వర్గీయా కామెంట్స్ దుమారం రేపాయి. ‘ఈ ఘటన ప్లేయర్లకు గుణపాఠం లాంటిది. ENGలో ఓ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్కు అమ్మాయి కిస్ ఇవ్వడం, అతడి దుస్తులు చింపేయడం వంటివి చూశాను. ప్లేయర్లు తమ పాపులారిటీని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఆయనపై విపక్షాలు, ఉమెన్ రైట్స్ గ్రూప్స్ భగ్గుమన్నాయి.


