News April 24, 2025
ఎన్టీఆర్: విద్యార్థులను అభినందించిన కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ లక్ష్మీశ, డీఈఓ సుబ్బారావు గురువారం కలెక్టరేట్లో ప్రత్యేకంగా అభినందించారు. 598 మార్కులతో జిల్లాలో మొదటి స్థానం సాధించిన కొల్లి స్వాతి, నంది 593, సాయి చరణ్, ప్రనీత్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 24, 2025
సునీల్ కుమార్పై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు

AP: సర్వీసు నిబంధనల ఉల్లంఘన, వివిధ అభియోగాలతో CID మాజీ చీఫ్ సునీల్ కుమార్పై ప్రభుత్వం ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు చేసింది. ప్రభుత్వానికి తెలియకుండా ఆయన పలుమార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపింది. జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని 2సార్లు UAE, మరోసారి ప్రభుత్వానికి తెలియకుండా స్వీడన్, ఇంకోసారి US వెళ్లారని పేర్కొంది. ప్రతి అభియోగంపై 30రోజుల్లో రాతపూర్వక జవాబివ్వాలని ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది.
News April 24, 2025
విజయవాడ: విడదల గోపీ అరెస్ట్పై అప్డేట్

మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీకి విజయవాడ జీజీహెచ్లో కొద్దిసేపటి క్రితం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పల్నాడు జిల్లా యడ్లపాడులోని స్టోన్ క్రషర్ కంపెనీ నిర్వాహకులను బెదిరించిన ఘటనపై నమోదైన కేసులో గురువారం ఉదయం ACB అధికారులు హైదరాబాద్లో గోపిని అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ తీసుకొచ్చిన అధికారులు వైద్యపరీక్షల తర్వాత ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
News April 24, 2025
అవార్డు అందుకున్న సత్యసాయి జిల్లా కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర అమలులో శ్రీ సత్యసాయి జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కలెక్టర్ టీఎస్ చేతన్ అవార్డును స్వీకరించారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. జిల్లా కలెక్టర్ను ఆయన అభినందించారు.