News May 14, 2024
ఎన్టీఆర్: స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్న ఈవీఎంలు

ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తవ్వడంతో ఎన్నికల కమిషన్ అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. పోలింగ్ ముగియగానే ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. ఈవీఎంలను రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పటిష్ఠమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కేంద్ర, రాష్ట్ర బలగాలు మూడంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశాయి.
Similar News
News March 2, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* కృష్ణా యూనివర్సిటీ MBA/MCA పరీక్షల షెడ్యూల్ విడుదల
* కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్
* కృష్ణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 255 మంది గైర్హాజరు
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాణాసంచా దుకాణాల్లో తనిఖీలు
* విజయవాడలో ప్రాణం తీసిన సెల్ఫీ
* గన్నవరంలో గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి అభ్యంతరం
News March 2, 2026
కృష్ణా: సుంకం ఇవ్వు .. చెరువు తవ్వు..!

కృష్ణా జిల్లాలో వరి పొలాలు అక్రమంగా చేపలు, రొయ్యల చెరువులుగా మారుతున్నాయనే ఆరోపణలొస్తున్నాయి. కృత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డ పరిధిలో వందల ఎకరాల సాగు భూములతో పాటు మడ అడవులను సైతం ఆక్రమించి తవ్వకాలు జరుపుతున్నారు. చెరువుల వ్యర్థ నీరు కాలువల్లోకి వదులుతుండటంతో పక్కనే ఉన్న పంట పొలాలు నిస్సారమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండతోనే ఇవి జరుగుతున్నాయని టాక్.
News March 2, 2026
మచిలీపట్నంలో మరో ఫోన్ నంబర్

మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్లోని సమాచార కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ తోపాటు కొత్తగా సెల్ ఫోన్ నంబర్ 94947 75462ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. ప్రయాణికులు విచారణ నిమిత్తం గతంలో ఉన్న ల్యాండ్ లైన్ నంబర్ 08672-227000తోపాటు నూతన సెల్ నెంబర్ 94947 75462ను సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.


