News March 9, 2025

ఎన్టీఆర్: హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు 

image

హోళీ పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా మాల్డా టౌన్(MLDT), చర్లపల్లి(CHZ) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 18న MLDT- CHZ(నం.03430), ఈనెల 20న CHZ- MLDT(నం.03429) ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, గుంటూరుతో పాటు ఇతర స్టేషన్లలో ఆగుతాయని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

Similar News

News March 9, 2025

NZB: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి

image

ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సత్యనారాయణ(62) ఒక షోరూంలో నైట్ వాచ్ మెన్ డ్యూటీ చేసి ఇంటికి బైక్‌పై వెళుతుండగా త్రిమూర్తి ఎదురుగా మరో బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు.

News March 9, 2025

పుత్తూరు: చినరాజుకుప్పంలో హత్య

image

పుత్తూరు పట్టణ పరిధిలోని చినరాజుకుప్పం గ్రామానికి చెందిన మణికంఠ (29) అనే యువకుడు ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News March 9, 2025

రేపటి నుంచి ‘జైలర్-2’ షూటింగ్

image

నెల్సన్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్-2’ సినిమా షూటింగ్ రేపు చెన్నైలో ప్రారంభం కానుంది. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘జైలర్’కు ఇది సీక్వెల్‌గా రూపొందనుంది. ఈ షెడ్యూల్ రెండు వారాలపాటు కొనసాగనుండగా, ఏప్రిల్‌లో రెండో షెడ్యూల్ మొదలవనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనున్నారు.

error: Content is protected !!