News March 9, 2025
ఎన్టీఆర్: హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హోళీ పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా మాల్డా టౌన్(MLDT), చర్లపల్లి(CHZ) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 18న MLDT- CHZ(నం.03430), ఈనెల 20న CHZ- MLDT(నం.03429) ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, గుంటూరుతో పాటు ఇతర స్టేషన్లలో ఆగుతాయని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News September 15, 2025
విజయనగరం ఎస్పీ కార్యాలయానికి 32 ఫిర్యాదులు

ఫిర్యాదు చేసిన బాధితుల సమస్యలను పోలీసు అధికారులు చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్య లత అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి 32 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి 7 రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News September 15, 2025
బెల్లంపల్లి: విద్యుత్ షాక్తో వ్యవసాయ కూలీ మృతి

బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన కూలీ శంకరయ్య (50) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో తలుపులు బిగిస్తుండగా విద్యుత్ వైరు తగిలింది. వెంటనే గమనించిన గ్రామస్థులు కర్రలతో కొట్టడంతో శంకరయ్య కింద పడ్డాడు. అతణ్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
News September 15, 2025
భద్రాద్రి: ‘సూర్యాంశ్’ నామకరణం చేసిన KTR

అన్నపురెడ్డిపల్లి మాజీ ZPTC దంపతులు లావణ్య-రాంబాబు తమ కుమారుడికి పేరు పెట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను కలిశారు. దంపతులు ‘సు’ అక్షరంతో పేరు కోరగా, KTR తన కుమారుడు హిమాన్షు పేరును గుర్తు చేసుకుని, సూర్యాంశ్ అని నామకరణం చేశారు. KTR దీవెనలు తమ కొడుకును ఆయనలాగే గొప్ప వ్యక్తిని చేస్తాయన్న నమ్మకం ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతతో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.