News February 1, 2025
ఎన్టీఆర్: 67.38% మేర జరిగిన పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్ జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం 10 గంటల వరకు 67.38% మేర పంపిణీ అయ్యింది. జిల్లాలో 2,29,914 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా 1,54,926 మందికి ప్రభుత్వ యంత్రాంగం పింఛన్ అందజేసింది. కాగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పింఛన్ పంపిణీ ప్రక్రియకు రాజకీయ పక్షాల నేతలు దూరంగా ఉన్నారు.
Similar News
News November 5, 2025
గ్రేటర్ వరంగల్ వరద ముప్పు నివారణకు సమగ్ర ప్రణాళికలు

గ్రేటర్ వరంగల్ను వరద ముంపు ముప్పు నుంచి శాశ్వతంగా రక్షించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో జరిగిన సమీక్షలో నాలాలు, డ్రైన్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, రిటైనింగ్ వాల్స్ నిర్మాణంపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిపుణుల సలహాలతో పటిష్ఠ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
News November 5, 2025
ఖమ్మం: నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోండి

ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం వారి DEET APPను ఫోన్లో డౌన్ లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. రిఫరల్ కోడ్:JSBCM అని టైప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ APPలో దాదాపు 900 కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడానికి రిజిస్టర్ చేసుకున్నాయని అన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 5, 2025
NZB: కార్తీకపౌర్ణమి.. ఫేమస్ శివాలయాలు ఇవే!

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. NZB కంఠేశ్వరాలయం, BDN చక్రేశ్వరాలయం పురాతన ఆలయాలు. ఆర్మూర్లో నవనాథ సిద్ధేశ్వారలయం జిల్లాకు ఈశాన్య దిశలో ఉంది. కామారెడ్డి(D) తాండూర్లో త్రిలింగ రామేశ్వరాలయంలో లింగాన్ని రామచంద్రుడు ప్రతిష్ఠించాడని నమ్మకం. మద్దికుంటలో బుగ్గ రామలింగేశ్వరాలయం, బండారామేశ్వర్పల్లెలో రాజారాజేశ్వరాలయం, బిక్కనూర్ సిద్ధి రామేశ్వరాలయం ప్రసిద్ధి చెందినవి


