News February 11, 2025

ఎన్టీఆర్: MLC స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల నిమిత్తం నామినేషన్ గడువు ముగిసేనాటికి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కాగా సోమవారం నామినేషన్ సమర్పించే గడువు ముగియగా ఈ ఒక్క రోజే 22 మంది నామినేషన్లు వేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ ఎన్నికలలో NDA కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర, PDF అభ్యర్థిగా లక్ష్మణరావు బరిలో నిలువగా, వైసీపీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Similar News

News February 11, 2025

గుంటూరులో పల్నాడు మిర్చిరైతుల ధర్నా !

image

పల్నాడు జిల్లా గ్రంథసిరి అచ్చంపేట మండలానికి చెందిన మిర్చి రైతులు మంగళవారం గుంటూరు మిర్చియార్డు వద్ద ధర్నాకు దిగారు. యార్డులోని విజయభాస్కర ట్రేడర్స్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి భాగస్వాములుగా ఉండి గతేడాది తమ పంటపై వచ్చిన లాభాలతో పాటూ అదనంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఐదుగురు రైతుల వద్ద రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

News February 11, 2025

వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు

image

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని పార్టీ కార్యాలయ వర్గాలను పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి పీఎస్‌కు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

News February 11, 2025

గుంటూరు: చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. వట్టిచెరుకూరు(M) లేమల్లెపాడుకి చెందిన సంజయ్(18) జనవరి 14న ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స అందించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఈ నెల 5న మళ్లీ అనారోగ్యానికి గురి కాగా GGHకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. చెట్టంత కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

error: Content is protected !!