News February 17, 2025

ఎన్నికలు: మేడ్చల్ జిల్లా అప్‌డేట్

image

మేడ్చల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 34 గ్రామ పంచాయతీల్లో 66,044 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 33,150 మంది పురుషులు ఉండగా, 32,898 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. 34 జీపీల పరిధిలో 320 వార్డులు ఉండగా, 320 పోలింగ్ కేంద్రాలను సైతం ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 11, 2026

కోళ్ల ఫారంలో ఈ తప్పు చేయొద్దు

image

కోళ్ల ఫారంలో చనిపోయిన కోళ్లను ఎప్పుడూ దాణా బస్తాలపై ఉంచకూడదు. ఇలా చేస్తే మరణించిన కోడిలో ఉండే బాక్టీరియా, వైరస్‌లు దాని శరీరం నుంచి దాణాలోకి చేరతాయి. ఈ దాణాను మనం షెడ్డు మొత్తం కోళ్లకు వేస్తాము. దీంతో ఆ బాక్టీరియా షెడ్డులో కోళ్లకు వ్యాపించి అవి కూడా మరణిస్తాయి. అందుకే వ్యాధితో ఏదైనా కోడి మరణిస్తే షెడ్డు నుంచి దూరంగా వాటిని పూడ్చిపెట్టాలి. ఈ విషయంలో పెంపకందారులు జాగ్రత్త వహించాలి.

News January 11, 2026

సొరకాయ జ్యూస్ తాగుతున్నారా?

image

సొరకాయ జ్యూస్ తాగేటప్పుడు జాగ్రత్త అవసరమని ICMR హెచ్చరించింది. ఇటీవల చేదుగా ఉన్న జ్యూస్ తాగి ఢిల్లీలో ఒకరు, UPలో ఇద్దరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిపుణులు పరిశీలించి టెట్రాసైక్లిక్ ట్రైటెర్పినాయిడ్ అనే విష పదార్థాల వల్లే సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈ విషానికి ప్రత్యేకంగా విరుగుడు లేదని తెలిపారు. దీంతో ఎక్కువ చేదుగా ఉన్న సొరకాయ జ్యూస్ తాగకూడదని అధికారులు సూచించారు.

News January 11, 2026

పురుగు మందుల పిచికారీ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

పురుగు మందులను పంటపై పిచికారీ చేసే వ్యక్తి తప్పనిసరిగా ముక్కు, కండ్లకు మందు తాకకుండా హెల్మెట్‌ లాంటిది తప్పనిసరిగా ధరించాలి. మందును కలిపేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. పిచికారీ సమయంలో నీళ్లు తాగడం, బీడీ, సిగరెట్‌ కాల్చకూడదు. పురుగు మందుల పిచికారీ తర్వాత స్నానం చేశాకే తినాలి. మందును గాలి వీచే వ్యతిరేక దిశలో పిచికారీ చేయరాదు. సాధ్యమైనంత వరకు గాలి, ఎండ ఉన్న సమయంలోనే స్ప్రే చేయడం మంచిది.