News August 6, 2024
ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేయాలి: విశాఖ కలెక్టర్
ఈ నెల 30న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో రెవెన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశమై మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ కోడ్) పటిష్టంగా అమలు చేయాలన్నారు. చెక్ పోస్టులను పెట్టి తనిఖీలు నిర్వహించాలని చెప్పారు.
Similar News
News September 30, 2024
విశాఖ కానిస్టేబుల్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్
ఎండాడ మహిళా పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ కనకల వెంకట నరసింహమూర్తి ఈనెల 22న విధులకు వెళ్లారు. డ్యూటీ అనంతరం నరసింహమూర్తి ఇంటికి రాలేదు. అతని భార్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో స్టేషన్లో ఆరా తీసి మిస్సింగ్ కేసు పెట్టింది. అయితే ఆదివారం నరసింహమూర్తి ఇంటికి చేరుకున్నాడు. ఆ సంగతి తెలుసుకున్న SI వెళ్లి ఆరా తీయగా పనిఒత్తిడితో ప్రశాంతత కోసం తిరుపతి, విజయవాడ దైవ దర్శనానికి వెళ్లినట్లు అతను తెలిపాడు.
News September 30, 2024
విశాఖ: ‘ఓటుహక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి’
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడిందన్నారు. ఓటు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైందని నవంబర్ 6 వరకు కొనసాగుతుందన్నారు. నవంబర్ 23న డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందన్నారు. 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. >Share it
News September 30, 2024
విశాఖ కేజీహెచ్ నుంచి విద్యార్థి పరారీ..!
డౌనూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థి కే.సురేష్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు కొయ్యూరు ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ చొరవ తీసుకుని కేజీహెచ్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థి సోమవారం ఆసుపత్రి నుంచి పరారయ్యాడని ఏటీడబ్ల్యూవో తెలిపారు. నాటువైద్యం చేయించడానికి తల్లిదండ్రులు స్వగ్రామమైన కుడిసింగి తీసుకెళ్లి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.