News June 5, 2024
ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాం: ఎస్పీ
కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, సిబ్బందికి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, ఎప్పటి కప్పుడు ప్రజలను చైతన్య పరిచామని పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక చర్యలకు, గొడవలకు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు.
Similar News
News September 29, 2024
తప్పు చేసుంటే అరెస్ట్ చేసుకోండి: పేర్ని నాని
తనను కూడా అక్రమ కేసుల్లో ఇరికించడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనను అరెస్టు చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కృష్ణాజిల్లాలోని అన్ని రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫైల్స్ వెతికారని, అసైన్డ్ పట్టాలు చూశారన్నారు. తాను తప్పు చేసింటే అరెస్ట్ చేసుకోవచ్చన్నారు.
News September 29, 2024
కృష్ణా: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
కానూరు తులసినగర్లోని ఫెడరల్ స్కిల్ అకాడమీలో నిరుద్యోగ యువతకు ట్యాలీలో ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాల కల్పన కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు జిల్లా ఉపాధి అధికారి విక్టర్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిగ్రీ చదివిన 18- 35 ఏళ్లలోపు వయస్సున్న అభ్యర్థులు అక్టోబర్ 3లోపు ఈ శిక్షణకు ఫెడరల్ స్కిల్ అకాడమీలో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు. Shareit
News September 29, 2024
TDP MLC అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్.. నేడే అనౌన్స్?
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల TDP ఎమ్మెల్సీ అభ్యర్థిని నేడు ప్రకటించే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు టీడీపీ అధిస్ఠానం ఇప్పటికే ఖరారు చేసిందని సమాచారం. తెనాలి MLA టికెట్ కూటమిలో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో ఆ సీటును ఆలపాటి త్యాగం చేశారు. అందుకు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ప్రతిఫలంగా దక్కుతోంది. ఆలపాటి గతంలో మూడు సార్లు MLAగా గెలిచారు. కాగా 1999లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.