News March 24, 2024
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

నంద్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వివిద రాజకీయ పార్టీల నాయకులు, పెద్దలు, ప్రజలు అందరూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News September 27, 2025
అర్జీల పరిష్కారం సమాచారం కోసం ఫోన్ 1,100: కలెక్టర్

అర్జీల పరిష్కారం సమాచారం కోసం ఫోన్ 1,100కు సంప్రదించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలో అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1,100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే అర్జీదారులు. Meekosam.ap.gov.i వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
News September 27, 2025
100 కాదు 112: కర్నూలు ఎస్పీ

ఆపదలు, అత్యవసర పరిస్థితులు, సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 112 సమాచారం ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం పేర్కొన్నారు. ఫోన్ చేసిన వెంటనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి బ్లూ కోల్ట్స్ రక్షక్ పోలీసులు చేరుకుంటారన్నారు. పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 100 నుంచి 112కు ప్రభుత్వం మార్చిందని, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
News September 27, 2025
గల్లంతయిన విద్యార్థి కుటుంబానికి కలెక్టర్ భరోసా

ఈనెల 25న కర్నూలు కేసీ కెనాల్లో ఈతకు వెళ్లి అశోక్ మృతిచెందగా, ప్రశాంత్ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సిరి మరణించిన విద్యార్థి అశోక్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. గల్లంతైన విద్యార్థి ప్రశాంత్ కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.