News March 18, 2024

ఎన్నికల నిబంధనలు పాటించాలి: సిద్దిపేట కలెక్టర్

image

రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి మిక్కిలినేని మను చౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. ఎన్నికల ప్రక్రియలో వివిధ అనుమతులను సువిధ యాప్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు.

Similar News

News July 3, 2024

కంగ్టి: బ్రెయిన్ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి

image

బ్రెయిన్ వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. కంగ్టి మండలం దామరగిద్ద గ్రామానికి చెందిన కోటగిరి రాజు(35) కొద్ది రోజులుగా తలలో నొప్పితో బాధపడుతూ సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఆపరేషన్ చేశారని, పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News July 3, 2024

MDK: నేటితో ముగియనున్న పదవీ కాలం

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో MPTC సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. 2019 మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. జులై 3న మండల పరిషత్, 4న జిల్లా పరిషత్‌కు పాలకవర్గాలు కొలువుదీరాయి. 5ఏళ్ల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించనుంది. మెదక్ జిల్లాలో 189 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.

News July 3, 2024

సిద్దిపేట: జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం

image

అటవీ హద్దులను నిర్ధారించుటకు, ఆక్రమణలను తొలగించుటకు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 23,738 హెక్టార్ల అటవీ విస్తీర్ణం 77 ప్రాంతాలలో ఉందని అన్నారు.