News September 21, 2025

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

Similar News

News February 20, 2026

ఆదిలాబాద్: పది పరీక్షలకు 52 పరీక్ష కేంద్రాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.

News February 19, 2026

ADB: స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు

image

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన SC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య నిధి పథకం ద్వారా స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా SC సంక్షేమ శాఖ అధికారిణి సునీత కుమారి పేర్కొన్నారు. ఈ – పాస్ ఆన్ లైన్‌లో మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 18, 2026

రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆదిలాబాద్‌ చిన్నారుల ప్రభంజనం

image

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఆటల పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ పోటీల కోసం జిల్లా నుంచి 26 మంది విద్యార్థులు హైదరాబాద్‌కు వెళ్లగా, వారు పాల్గొన్న దాదాపు అన్ని విభాగాల్లోనూ సత్తా చాటారు. వారిని కలెక్టర్ అభినందించారు.