News February 26, 2025

ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు: MHBD ఎస్పీ

image

ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 150 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి ఎస్పీ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పోలింగ్ కేంద్రాల్లో 1663 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు.

Similar News

News February 26, 2025

NZB: శివాలయానికి వెళ్లొచ్చే సరికి మూడిళ్లలో చోరీ

image

శివరాత్రికి దేవాలయాలకు వెళ్లి వచ్చే సరికి అగంతకులు తాళం వేసిన మూడిళ్లలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గంగస్థాన్ నుంచి కేశాపూర్ వెళ్ళేదారిలో రియల్టర్ బలరాం రెడ్డి ఇంట్లో 25 తులాల బంగారం, ఆర్టీసీ కాలనీలోని రవీందర్ ఇంట్లో 2 తులాల బంగారం, ఏక శిలా నగర్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలోని కిరాణ వ్యాపారి రవీందర్ ఇంట్లో రూ.60 వేల నగదును అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 26, 2025

పాలకుర్తి: ఘనంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

image

పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకుల వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ఆలయ ఈవో మోహన్ బాబు, ప్రజాప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News February 26, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖ జిల్లా వ్యాప్తంగా మార్మోగిన శివనామస్మరణ
➤ రేపు 13 కేంద్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
➤ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని పాఠశాలలకు సెలవు
➤ త్వరలో విశాఖ మెట్రో పనులు ప్రారంభం?
➤ మల్కాపురానికి చెందిన 22 ఏళ్ల యువకుడు మృతి
➤ ఆర్.కే, అప్పికొండ, భీమిలి బీచ్‌లలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేసిన అధికారులు

error: Content is protected !!