News October 7, 2025

ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ రెడీ: ADB SP

image

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుతో పాటు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాల వరకు తరలింపు పకడ్బందీగా చేపడుతామన్నారు. ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Similar News

News February 11, 2026

బోథ్ అడవుల్లో పులుల సంచారం

image

బోథ్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి, చిరుత సంచారం కలకలం రేపుతోంది. పుణ్య నాయక్ తండాలో పవర్ సక్రుకు చెందిన ఆవుపై పులి దాడి చేసి చంపింది. అటవీ అధికారులు ప్రశాంత్ పాటిల్, విశ్వనాధ్ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, విద్యుత్ కంచెలు వేయవద్దని హెచ్చరించారు. అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News February 10, 2026

ADB: ఈ నెల 20 వరకు పత్తి కొనుగోళ్లు

image

సీసీఐ కేంద్రాలలో కొనుగోలు చేస్తున్న పత్తి ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి తెలిపారు. రైతులు పత్తి అమ్మెందుకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొవాలని సూచించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులకు వీలులేదన్నారు. పత్తి నిల్వ ఉన్న రైతులు తప్పకుండా త్వరగా సీసీఐలో విక్రయించి మద్దతు ధర పొందాలని వివరించారు.

News February 10, 2026

1000 మందితో ఎన్నికల బందోబస్తు: ADB SP

image

ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. బందోబస్తులో ముగ్గురు అదనపు ఎస్పీలు, 3 డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 ఎస్ఐలతో, మహిళా సిబ్బంది, హోంగార్డ్స్, రిజర్వు సిబ్బంది, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలచే బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 10 వార్డులకు ఒక ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఉంటారని వివరించారు.