News December 9, 2025
ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్

మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మొదటి దశ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అబ్జర్వర్లతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Similar News
News December 15, 2025
AMPRIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

CSIR-అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News December 15, 2025
స్టూడెంట్స్ సంఖ్య ఆధారంగానే ‘కుక్’లు

TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి వంట మనుషుల సంఖ్య ఉండాలని DEOలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో 25 మంది స్టూడెంట్స్ ఉంటే కుక్ కమ్ హెల్పర్ను, 26-100 మధ్య ఉంటే ఇద్దరు హెల్పర్లు, 101-200 మధ్య ఉంటే ముగ్గురు హెల్పర్లను తీసుకోవాలన్నారు. ఆపై ప్రతి 100 మందికి ఒక అదనపు హెల్పర్ను నియమించుకోవచ్చన్నారు. సంబంధిత బిల్లులు ఆన్లైన్ ద్వారా క్లైయిమ్ చేయాలని తెలిపారు.
News December 15, 2025
WGL: బ్యాలెట్ పేపర్ ఓటు వినియోగంలో తప్పిదాలు!

ఉమ్మడి జిల్లాలో 2వ దశ పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ విధానంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్ర విషయాలు వెలుగులోకొస్తున్నాయి. వృద్ధులకు ఓటు ఎలా వేయాలో తెలియలేదట. యువత సైతం కొంత మంది ఇదే తోవలో నడిచారు. బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ బదులు వేలి ముద్ర వేయడం, గుర్తుపై కాకుండా మడత పెట్టీ ఇచ్చిన పేపర్పై స్వస్తిక్ వేయడం, కొంత మంది రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తే ఒకటే వేసి మరొకటి జేబులో పెట్టుకున్నారట.


