News April 13, 2024
ఎన్నికల నిర్వహణలో సెక్టర్ ఆఫీసర్ల పాత్ర కీలకం: జేసీ

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సెక్టర్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్ల పాత్ర ఎంతో కీలకమని జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియోజకవర్గ పరిధిలోని సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, మాస్టర్ ట్రైనర్లకు శనివారం నగర పాలక కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ, కోడ్ అమలు పోలింగ్ రోజు నిర్వహించాల్సిన విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు.
Similar News
News October 6, 2025
స్వచ్ఛతలో అందరూ భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

స్వచ్ఛతలో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో సోమవారం స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి విశిష్ట అతిథిగా గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ మురళీమోహన్ హాజరయ్యారు. స్వచ్ఛతలో రాష్ట్రస్థాయిలో ఏడు అవార్డులు, జిల్లాస్థాయిలో 55 అవార్డులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
News October 6, 2025
చిత్తూరు విద్యార్థికి రాష్ట్రపతి అవార్డు

చిత్తూర్ అపోలో యూనివర్సిటీ విద్యార్థికి రాష్ట్రపతి అవార్డు దక్కింది. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్లో 2022-23 వాలంటీర్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. రాష్ట్రపతి భవన్లో సోమవారం ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి విద్యార్థి జిష్ణు అందుకున్నాడు. ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జిష్ణు పర్యావరణ పరిరక్షణ, రక్తదానం, సామాజిక సేవ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నారు.
News October 6, 2025
రేపు అధికారికంగా వాల్మీకి జయంతి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 7న వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం తెలిపారు. రేపు జిల్లా సచివాలయంలోని వివేకానంద భవన్లో ఉ.10.30 గం.లకు మహర్షి వాల్మీకి చిత్రపటానికి అంజలి ఘటించడం జరుగుతుందన్నారు. అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.