News February 9, 2025
ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి: మంచిర్యాల కలెక్టర్

జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 19, 2026
పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు ఇవి పాటించాల్సిందే: సీపీ

పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. చిన్నారులు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంచాలని హెచ్చరించారు. లేకపోతే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదాలు ఉన్నాయన్నారు. పిల్లలకు UPI పిన్, క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకూడదని అన్నారు. ఫోన్లో ‘చైల్డ్ సెట్టింగ్ టూల్స్’ వాడాలని చెప్పారు.
News February 19, 2026
మాతృ, శిశు మరణాల నివారణే లక్ష్యం: డీఎంహెచ్ఓ

జిల్లాలో హై రిస్క్ గర్భధారణలను ముందుగానే గుర్తించి, మాతృ, నవజాత శిశు మరణాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. గురువారం ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ‘ఇంటిగ్రేటెడ్ హై-రిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ అండ్ మేనేజ్మెంట్’పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.
News February 19, 2026
ప్రేయసితో ❤️ పెళ్లికి సిద్ధమైన ధవన్.. ఫొటోలు వైరల్

IND మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ప్రేయసి సోఫీ షైన్(ఐర్లాండ్)తో పెళ్లికి సిద్ధమయ్యారు. నిన్న సంగీత్ వేడుకల ఫొటోలను SMలో షేర్ చేయగా వైరలవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వివాహం జరగనున్నట్లు సమాచారం. కాగా AUSకు చెందిన ఆయేషాను ధవన్ 2012లో వివాహం చేసుకొని 2023లో విడాకులు తీసుకున్నారు.


