News January 28, 2026

ఎఫ్‌ఎల్‌ఎన్ అమలుపై కలెక్టర్ డీకే బాలాజీ సమీక్ష

image

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న Foundational Literacy & Numeracy కార్యక్రమంపై కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక దృష్టి సారించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన కృష్ణా జిల్లాలోని వడ్లమన్నాడు జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ తనిఖీలలో భాగంగా 10th విద్యార్థులకు అమలవుతున్న 100 డేస్ యాక్షన్ ప్లాన్ పరిశీలించారు.

Similar News

News January 28, 2026

ఉప్పులూరు ఆసుపత్రిలో DMHO ఆకస్మిక తనిఖీ

image

ఉప్పులూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. DMHO యుగంధర్ ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా, ఒక సామాన్యుడిలా ఆసుపత్రికి వచ్చారు. నేరుగా వెయిటింగ్ హాల్‌లోకి వెళ్లి, అక్కడ చంటిబిడ్డతో కూర్చున్న ఒక తల్లి వద్దకు వెళ్లి.. వైద్య సేవలపై అని ఆరా తీశారు. అనంతరం ఆయన లోపలికి వెళ్లి రిజిస్టర్లు, OP రికార్డులు పరిశీలిస్తుండగా, చూసిన సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.

News January 28, 2026

కృష్ణా: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

వడ్లమన్నాడు పాఠశాలలో బుధవారం సందడి నెలకొంది. కలెక్టర్ బాలాజీ పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. ఆహారం రుచి, నాణ్యతను పరీక్షించిన కలెక్టర్, విద్యార్థులతో ముచ్చటించి భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, వంటశాల పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.

News January 28, 2026

కృష్ణా: పల్లకిలోనే వీరమ్మ తల్లి ఊరేగింపు

image

ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో అమ్మవారి గ్రామోత్సవంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈసారి కూడా అమ్మవారి ఊరేగింపు సంప్రదాయబద్ధంగా పల్లకిలోనే సాగుతుందని ఆలయ వంశస్థులు స్పష్టం చేశారు. ఈ రాత్రి 9 గంటల తర్వాత ఆలయం నుంచి వెలువడి, రేపు రాత్రికి అమ్మవారు పుట్టింటికి చేరుకుంటారు. రథంపై ఊరేగింపు ఉంటుందనే ప్రచార నేపథ్యంలో, గండదీప భక్తులు పల్లకి సేవనే గమనించాలని కోరారు.