News February 4, 2026

ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమ అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన: డీఈఓ

image

మహబూబ్‌నగర్ జిల్లా రాంనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమ అమలు తీరును డీఈఓ ప్రవీణ్ కుమార్ బుధవారం పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థుల చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు, మాక్ టెస్ట్ ఫలితాలు, యాక్షన్ ప్లాన్ అమలును సమీక్షించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక సాధన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News February 4, 2026

పాలమూరు అభివృద్ధికి రూ.300 కోట్లు మంజూరు: డీకే అరుణ

image

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. బుధవారం ఎంవీఎస్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సమ్మేళనం సభలో ఆమె మాట్లాడారు.. విమానాశ్రయాలకు దీటుగా అన్ని జిల్లాలలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.

News February 4, 2026

దేవరకద్ర ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ

image

దేవరకద్ర ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. జీనుగరాలకు చెందిన వెంకటేష్ యాదవ్ లోన్ కోసం ఓ డాక్యుమెంట్‌పై ఎమ్మార్వో దీపిక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. తప్పుడు సంతకంపై బ్యాంకు అధికారులు ఎమ్మార్వోకు సమాచారం అందించారు. దీంతో ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 4, 2026

మహబూబ్‌నగర్: అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులపై అవగాహన సదస్సు

image

మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్ కళాభవనంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రచార ఖర్చుల వివరాల నమోదుపై కీలక సూచనలు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.