News March 10, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. అభిమానుల హర్షం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పేరు ఖరారు కావడంతో మెదక్ ప్రాంతంలో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎంపీగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు.
Similar News
News July 7, 2025
‘నేడు స్కూళ్లకు సెలవు’ అని మీకు మెసేజ్ వచ్చిందా?

TG: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు యాజమాన్యాలు ఇవాళ సెలవును ప్రకటించాయి. ‘మొహర్రం సెలవు’ అంటూ పేరెంట్స్ ఫోన్లకు మెసేజులు పంపించాయి. రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం మొహర్రం పబ్లిక్ హాలిడే ఆదివారం రోజే ఉంది. అటు పలు స్కూళ్లు మాత్రం ఇవాళ సెలవు లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపాయి. దీంతో కొందరిలో గందరగోళం నెలకొంది. మరి మీకు సెలవు మెసేజ్ వచ్చిందా? కామెంట్.
News July 7, 2025
ములుగు జిల్లాలో టెన్షన్.. టెన్షన్..!

జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చల్వాయికి చెందిన చుక్క రమేశ్ ఆత్మహత్య వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు ఇస్తున్నాయంటూ రమేశ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కేసు నమోదుతో భయాందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపడతామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. కాగా నేడు మంత్రుల పర్యటన ఉంది.
News July 7, 2025
ఖమ్మం జిల్లాలో విషాదం.. వ్యవసాయ కూలీ మృతి

కూసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన మారుతి పెద్ద గోపయ్య(56) వ్యవసాయ కూలీ. ఓ రైతు పొలానికి నారు మడిలో యూరియా చల్లేందుకు వెళ్లారు. ఈ సమయంలో గుండెపోటుతో అస్వస్థతకు గురి కాగా, తోటి కూలీలు వెంటనే సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మరణించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు.