News February 25, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. 200 మంది పోలీస్ ఫోర్స్: ములుగు SP

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ శబరీశ్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాల వద్ద 200 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు ఎస్పీ చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, బూత్ వద్ద 100, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు.
Similar News
News February 27, 2026
కామారెడ్డి: సంఘటన్ సృజన్ అభియాన్తో సంస్థాగత బలోపేతం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘటన్ సృజన్ అభియాన్ 7వ రోజు శిక్షణ శిబిరం విజయవంతంగా జరిగింది. రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ మైనారిటీ విభాగం ఛైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గార్హీ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ స్థాయి నిర్మాణ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాలపై మార్గదర్శనం చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నగేశ్ రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
News February 27, 2026
HYD: ఆ రోజు ఆలయాలు బంద్!

చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3న కడ్తాల్లోని మైసిగండి మైసమ్మ ఆలయంతో పాటు శివాలయ, రామాలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో స్నేహలత చెప్పారు. మూడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ శుద్ధి, అభిషేకం, అలంకరణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. గ్రహణం దృష్య్టా నగరంలోని ప్రముఖ ఆలయాలను సైతం మూసివేయనున్నారు.
SHARE IT
News February 27, 2026
వావ్.. వరంగల్ నగరం ఎంత బాగుంది: ఎంపీ కావ్య

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 అంతస్తుల భవనం పైనుంచి చూస్తే వరంగల్ నగరం ఎంతో బాగుందని ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నేడు సందర్శించిన సందర్భంగా కలెక్టర్ సత్య శారదతో కలిసి లిఫ్టులో 24 అంతస్తుల ఆస్పత్రి భవనంలోని అన్ని ఫ్లోర్లలో తిరిగారు. చివరన 24 అంతస్తుల పైభాగానికి వెళ్లి నగరాన్ని చూస్తూ సంబరపడ్డారు.


