News February 25, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. 200 మంది పోలీస్ ఫోర్స్: ములుగు SP

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ శబరీశ్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాల వద్ద 200 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు ఎస్పీ చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, బూత్ వద్ద 100, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు.

Similar News

News November 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 5, 2025

WTM-2025లో పాల్గొన్న మంత్రి దుర్గేశ్

image

లండన్‌లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్(WTM)-2025 సమావేశంలో AP పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన స్టాల్‌, AP పర్యాటక స్టాల్‌ను వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రతినిధులతో రాష్ట్రంలో పర్యాటక పెట్టుబడుల అవకాశాలు, టూరిజం ప్యాకేజీల గురించి వివరించారు. AP పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

News November 5, 2025

కరీంనగర్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

నిరుద్యోగ యువతీయువకులకు జిల్లా కేంద్రంలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వై.తిరుపతిరావు తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థలో 30 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్, ఆపై పాసైనవారు, 20- 30ఏళ్ల వయసు గలవారు అర్హులు. ఆసక్తిగలవారు వివరాలకు పైనంబర్లను సంప్రదించవచ్చు. కశ్మీర్ గడ్డ, ఈసేవ కేంద్రం పైఅంతస్తులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని అధికారి సూచించారు.