News February 4, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి షాక్.. బరిలో మరో అభ్యర్థి

image

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల MLC అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించగ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.

Similar News

News March 6, 2026

ADB: రైతు భరోసా ఇంకెప్పుడు?

image

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా కోసం రైతాంగం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తోంది. 2025-26 గాను ప్రభుత్వం కేవలం ఖరీఫ్ సాయం మాత్రమే అందించింది. రబీ సీజన్‌కు సంబంధించి గత OCTలోనే నిధులు విడుదల కావాల్సి ఉన్నా నేటికీ అతీగతీ లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.83 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా ADB 4.85, NRML 4.23, MNCL 2.46, ASF 3.25తో కలిపి మొత్తం సుమారు 14.79 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగవుతున్నాయి.

News March 6, 2026

NZB: అభివృద్ధిలో స్నేహపూరిత పోటీ తత్వం ఉండాలి: షబ్బీర్ అలీ

image

అభివృద్ధిలో ఉమ్మడి నిజామాబాద్-కామారెడ్డి జిల్లాల మధ్య స్నేహపూరిత పోటీ తత్వం ఉండాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అధికారులకు సూచించారు. శుక్రవారం నిజామాబాద్‌లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ ఉమ్మడి జిల్లాల ప్రారంభ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రెండు జిల్లాలకు సంబంధించిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

News March 6, 2026

చనిపోయారన్న ఓటర్లను ఈసీ ముందు నిలబెడతా: మమత

image

SIRకు వ్యతిరేకంగా బెంగాల్ CM మమత కోల్‌కతాలో ధర్నా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TMCని ఓడించాలనే కుట్రతోనే BJP, EC కలిసి సర్ ప్రక్రియ చేపట్టాయని మండిపడ్డారు. ఇదొక సైలెంట్ రిగ్గింగ్ అని దుయ్యబట్టారు. బతికి ఉన్న ఓటర్లనూ చనిపోయినట్లుగా ప్రకటించారని ఆరోపించారు. వారందరినీ ఈ వేదిక సాక్షిగా ఈసీ ముందు నిలబెడతానని పేర్కొన్నారు. లక్షల మంది అర్హుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఫైరయ్యారు.