News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కి షాక్.. బరిలో మరో అభ్యర్థి

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల MLC అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించగ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
Similar News
News November 10, 2025
సుదీర్ఘ షట్డౌన్కు త్వరలోనే ముగింపు: ట్రంప్

ప్రభుత్వ <<17882827>>షట్డౌన్ <<>>త్వరలోనే ముగుస్తుందని US ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. అయితే ఖైదీలకు, ఇల్లీగల్స్కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేందుకు తాను ఒప్పుకోనని, ఈ విషయాన్ని డెమొక్రాట్లు అర్థం చేసుకుంటారని చెప్పారు. 40 రోజులుగా కొనసాగుతున్న సుదీర్ఘ షట్డౌన్ కారణంగా పలు ప్రభుత్వ <<17975561>>సర్వీసులపై<<>> తీవ్ర ప్రభావం పడింది. కార్మికులకు జీతాలు అందడం లేదు.
News November 10, 2025
మన్యం: అవిగో గజరాజులు.. గుండెల్లో గుబులు

మన్యం జిల్లాను ఏనుగుల గుంపు వదలడం లేదు. పాలకొండ నియోజకవర్గం నుంచి.. పార్వతీపురం వరకు సంచరిస్తూ మన్యం వాసుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రతిరోజూ అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారే తప్ప వాటి తరలింపునకు చర్యలు చేపట్టడం లేదని.. కుంకీ ఏనుగులు తెచ్చి సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు. సోమవారం కొమరాడ (M) వన్నం, మాదలంగి పరిసర గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరించింది.
News November 10, 2025
MSMEలకు ఆధునిక సౌకర్యాలు

AP: రాష్ట్రంలోని MSMEలకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే తరహా పరిశ్రమలున్న క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల(CFC)ను ఏర్పాటుచేయనుంది. ఒక్కోదానికి ₹10కోట్లు వెచ్చించనుంది. ఇందులో కొత్త డిజైన్లు, రీసెర్చ్, టెక్నాలజీ, నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్, క్వాలిటీ కంట్రోల్ తదితర సదుపాయాలు ఉంటాయి. వీటివల్ల MSMEలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అవకాశం లభిస్తుంది.


