News February 10, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3వేల మెజార్టీ రావాలి: జగ్గారెడ్డి

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంగారెడ్డి నుంచి 3000 ఓట్ల మెజార్టీ రావాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ధర్మ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. సమావేశంలో TGIIC చైర్ పర్సన్ నిర్మలరెడ్డి, నాయకులు తోపాజి అనంత కిషన్, ఆంజనేయులు పాల్గొన్నారు.

Similar News

News March 29, 2026

సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వండి: మార్కాపురం కలెక్టర్

image

మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని కోరారు. మార్కాపురం జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.

News March 29, 2026

మంగళగిరిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

image

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. CM చంద్రబాబు ఈ ఉత్సవాల్లో పాల్గొని, పార్టీ భారీ జెండాను ఆవిష్కరించారు. NTR విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ ప్రస్థానాన్ని, భవిష్యత్తు లక్ష్యాలను CBN వివరించారు. కార్యక్రమంలో TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

News March 29, 2026

పాలిటెక్నిక్ కాలేజీలో ప్రారంభమైన ప్లాటినం జూబ్లీ వేడుకలు

image

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్లాటినం జూబ్లీ వేడుకలతో పాటు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా ప్రారంభమైంది. TGNPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బైరి ప్రభాకర్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.