News February 8, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరిటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేష్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 20, 2025
పాటియాలా లోకోమోటివ్ వర్క్స్లో 225 పోస్టులు

<
News December 20, 2025
పోలియో నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి: కలెక్టర్

పోలియో పూర్తిగా అంతమైనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. శనివారం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పల్స్ పోలియో అవగాహన ర్యాలీని వీఎంసీ కమిషనర్ ధ్యాన్చంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా చుక్కలు వేయించాలని చెప్పారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News December 20, 2025
రానున్న ఐదు రోజులు చలి ముప్పు

కర్నూలు, నంద్యాల జిల్లాలను చలి వణికిస్తోంది. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16-18 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం నుంచే చలి ప్రభావం మొదలవుతోంది. ఈ నెల 24 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16°C నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


