News February 8, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ

image

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరిటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేష్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News February 8, 2025

‘అఖండ-2’లో విలన్‌గా క్రేజీ యాక్టర్?

image

సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన నటుడు ఆది పినిశెట్టి మరోసారి బోయపాటి శ్రీను మూవీలో విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’లో ప్రతినాయకుడి పాత్రలో ఆది కనిపిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమాలో ఆది విలనిజంకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

News February 8, 2025

ఎద్దు దాడిలో గాయపడ్డ వృద్ధుడు మృతి

image

నర్సీపట్నం మున్సిపాలిటీ బీసీ కాలనీలో బుధవారం జరిగిన ఎద్దు దాడిలో గాయపడ్డ గీశాల కన్నయ్య అనే వృద్ధుడు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఎద్దు చేసిన దాడిలో కన్నయ్యకు కాలు, చెయ్యి విరిగిపోయాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ తరలించాలని ఏరియా ఆసుపత్రి వైద్యులు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 8, 2025

పెద్దపల్లి: ఈనెల 10 నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

ఈనెల 10న పెద్దపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ప్రజలు దీనిని గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన సూచించారు.

error: Content is protected !!