News February 8, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ

image

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరిటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేష్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News February 25, 2026

తిరుపతిలో చిన్నారి మర్డర్.. వెలుగులోకి కొత్త విషయాలు

image

తిరుపతిలో ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌తో ఓ తల్లి తన కుమార్తెను <<19233769>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆశాలత తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. భరణం కింద రూ.4 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. తర్వాత ఇన్‌స్టాగ్రాం ద్వారా రెడ్డి కుమార్ పరిచయం కావడంతో అతడితో సహజీవనం చేస్తోంది. వీళ్ల పెళ్లికి అడ్డుగా ఉందనే కారణంతోనే ఆశాలత కుమార్తెను చంపేసి పూడ్చి పెట్టారు.

News February 25, 2026

VKB: ఇద్దరు ప్రభుత్వ వైద్యుల తొలగింపు

image

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వికారాబాద్ జిల్లాలోని GMCలో విధులు నిర్వర్తిస్తున్న యశ్వంత్ గౌడ్, విజయశ్రీ ఇద్దరు ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్‌లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.

News February 25, 2026

పునర్విక చికిత్సకు రూ.50 లక్షలు: MP బైరెడ్డి శబరి

image

కర్నూలు (D) వెల్దుర్తికి చెందిన చిన్నారి <<19232308>>పునర్విక<<>> చికిత్స కోసం కేంద్ర ఆరోగ్యశాఖ రూ.50 లక్షల సాయం చేసిందని MP బైరెడ్డి శబరి తెలిపారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సమస్యను తండ్రి తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా NPRD పథకం నుంచి నిధులు విడుదలయ్యాయని అన్నారు. సహకరించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.