News February 9, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేశ్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News April 10, 2026
5,000 మంది ఇరాన్ సైనికులు హతం: ఇజ్రాయెల్

40 రోజులపాటు కొనసాగిన యుద్ధంలో ఇరాన్లోని 4వేల టార్గెట్లపై 10,800 దాడులు చేసినట్లు IDF వెల్లడించింది. దాడి మొదటి రోజే కేవలం 40 సెకన్లలో సుప్రీం లీడర్ ఖమేనీ సహా 40 మందిని హతమార్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది ఇరానియన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేసింది. 85 శాతం డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసినట్లు పేర్కొంది. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ 650 మిస్సైళ్లను వేయగా 24 మంది చనిపోయినట్లు సమాచారం.
News April 10, 2026
HYD: DGP ఎదుట లొంగిపోనున్న 30మంది మావోయిస్టులు

హైదరాబాద్లో ఈరోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుపోతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మ.3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోనుండగా, ఇందులో PLGA బెటాలియన్ సభ్యులు ఉన్నట్లు సమాచారం. లొంగుబాటుతో నక్సలిజం నిర్మూలనలో పోలీసులు మరో ముందడుగు వేశారు.
News April 10, 2026
HYD: రాజకీయ నేత కుమారుడి లైంగిక వేధింపులు.. బాలిక ఆత్మహత్య

హయత్నగర్లో దారుణం జరిగింది. ఓ రాజకీయనేత కుమారుడి లైంగిక వేధింపులకు మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. విషయాన్ని బయటకు చెబితే కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. కూతురు మృతదేహాన్ని తీసుకొని సొంత గ్రామానికి బాధితులు వెళ్లిపోయారు. బాలిక మృతికి కారకులపై పోక్సో కేసు నమోదు చేయాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి తండ్రి PSలో ఫిర్యాదు చేయడానికి వస్తున్నట్లు సమాచారం.


