News February 13, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739444473450_51243309-normal-WIFI.webp)
హనుమకొండ జిల్లాలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News February 13, 2025
ప్రియుడి నుంచి వేధింపులు ఎదుర్కొన్నా: ఐశ్వర్యా రాజేశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739450178211_695-normal-WIFI.webp)
చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లికి అండగా ఉండేందుకు పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసినట్లు హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ చెప్పారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఓ వ్యక్తిని ఇష్టపడినట్లు తెలిపారు. తర్వాత అతడి నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లవ్ కంటే అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే తనకెంతో భయమన్నారు. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు.
News February 13, 2025
రాష్ట్రపతి పాలనలో మణిపుర్ రికార్డు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739459382490_695-normal-WIFI.webp)
అత్యధికసార్లు(11) రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా మణిపుర్ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో UP(10), J&K(9) బిహార్(8), పంజాబ్(8) ఉన్నాయి. రోజుల(4,668) పరంగా J&K టాప్లో ఉంది. ఆ తర్వాత పంజాబ్(3,878), పాండిచ్చేరి(2,739) ఉన్నాయి. 1951లో తొలిసారిగా పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటికి 29 రాష్ట్రాలు/UTలలో 134సార్లు విధించారు. TG, ఛత్తీస్గఢ్లలో ఒక్కసారీ ప్రెసిడెంట్ రూల్ రాలేదు.
News February 13, 2025
2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి: చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739456788140_81-normal-WIFI.webp)
AP: 2027 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేర పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి, నీళ్లు విశాఖకు తీసుకెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టూ అందుబాటులోకి తేవాలన్నారు. అటు వెలిగొండ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాలని సూచించారు.