News February 26, 2025

ఎమ్మెల్సీ ఓటర్లకు సిద్దిపేట సీపీ సూచనలు

image

పట్టబద్రులు, టీచర్లు పోలీసుల సలహాలు, సూచనలు పాటించి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించామని, కావున గుంపులు గుంపులుగా తిరగవద్దని సీపీ సూచించారు.

Similar News

News March 1, 2026

హోలీ వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నరసింహ

image

హోలీ పండుగను ఆనందంగా, బాధ్యతగా జరుపుకోవాలని ఎస్పీ కె. నరసింహ ప్రజలను కోరారు. బలవంతంగా ఎవరిపై రంగులు చల్లకూడదన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, గుంపులుగా వాహనాలతో తిరిగినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రసాయన రంగులకు బదులు సహజ రంగులు వాడాలని ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ఆయన సూచించారు.

News March 1, 2026

ADB: ఆదర్శం.. ఆ గ్రామంలో కట్న, కానుకలు నిషేధం

image

సామాజిక మార్పు దిశగా ఇంద్రవెల్లి(M) ప్రధాన్‌గూడ, హీరాసుఖనగర (కొబ్బైగూడ) గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఆదివారం గ్రామ పెద్దలు సమావేశమై శుభకార్యాల్లో కట్న, కానుకలను పూర్తిగా నిషేధిస్తూ చారిత్రక తీర్మానం చేశారు. దీనికి బదులుగా, ఏ ఇంట్లో వేడుక జరిగినా గ్రామంలోని ప్రతి ఇల్లు ₹300 చొప్పున చందా జమ చేసి, ఆ కుటుంబానికి ఆర్థికంగా నిలవాలని నిర్ణయించారు. ఈ ఉమ్మడి పంచాయతీలో సుమారు 500 మంది ఓటర్లున్నారు.

News March 1, 2026

రేపల్లె డీఎస్పీ హెచ్చరిక

image

దీపావళి పండుగ నేపథ్యంలో నిల్వ ఉన్న టపాసులు, మందుగుండు సామగ్రిని తక్షణమే ప్రభుత్వ అనుమతి పొందిన గోదాములకు అప్పగించాలని రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సూచించారు. సబ్ డివిజన్ పరిధిలోని 9 మండలాల ప్రజలు, వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.