News February 26, 2025
ఎమ్మెల్సీ ఓటర్లకు సిద్దిపేట సీపీ సూచనలు

పట్టబద్రులు, టీచర్లు పోలీసుల సలహాలు, సూచనలు పాటించి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించామని, కావున గుంపులు గుంపులుగా తిరగవద్దని సీపీ సూచించారు.
Similar News
News February 27, 2025
విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లు రీ షెడ్యూల్

విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లను నేడు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 22:45 గంటలకు బయలుదేరాల్సిన హౌరా – SMV బెంగుళూరు SF ఎక్స్ప్రెస్ గురువారం తెల్లవారుజామున 2 గంటలకు హౌరాలో బయలుదేరనుంది. సికింద్రాబాద్ – విశాఖ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ఈరోజు రాత్రి గంట ఆలస్యంగా 9.30 గంటలకు విశాఖలో బయలుదేరనుంది. ప్రయాణీకులు గమనించాలని కోరారు.
News February 27, 2025
అఫ్గాన్ విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో అఫ్గానిస్థాన్ 8 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో అఫ్గాన్ ఓడిపోయేలా కనిపించినా, చివరి 2 ఓవర్లలో ఆ జట్టు బౌలర్లు ఇంగ్లండ్ వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పారు. దీంతో ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ENG 317కు ఆలౌటైంది. ENG బ్యాటర్లలో రూట్ (120) సెంచరీతో రాణించినా ఫలితం లేకుండా పోయింది.
News February 27, 2025
Vi, ఎయిర్టెల్ కస్టమర్లను ఆకర్షిస్తున్న BSNL ఆఫర్

లాంగ్టర్మ్ వ్యాలిడిటీతో BSNL అందిస్తున్న ఓ ఆఫర్ వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోందని సమాచారం. 336 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 24GB డేటా, రోజుకు 100 ఫ్రీ SMSలు, ఇతర ఫీచర్లను BSNL రూ.1499కే అందిస్తోంది. 24GB ముగిశాక 40kbps స్పీడుతో ఉచితంగా నెట్ పొందొచ్చు. ప్రస్తుతం వి, ఎయిర్టెల్ 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ను రూ.1849కి అందిస్తుండటంతో కస్టమర్లు ఆలోచిస్తున్నారు.