News September 7, 2024
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో బిగ్ ట్విస్ట్

ఎమ్మెల్సీ దువ్వాడ వివాదంలో శనివారం బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. ఎమ్మెల్సీ శ్రీనివాస్ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిపై దివ్వెల మాధురికి అన్ని హక్కులూ కల్పిస్తూ కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టేషన్ చేసిన డాక్యూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గత కొద్దిరోజులుగా దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణీ, దివ్వెల మాధురి మధ్య నెలకొన్న వివాదంలో తాజాగా సంచలనాత్మకమైన అంశం తెరపైకి వచ్చింది.
Similar News
News September 18, 2025
సంతబొమ్మాళి: మూలపేట పోర్టులో కార్మికుడు మృతి

సంతబొమ్మాళి (M)మూలపేట పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు పింగ్వా(36) గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..జార్ఖండ్కు చెందిన పింగ్వా రెండు వారాల కిందట మూలపేట పోర్ట్లో కూలీగా పని చేసుందుకు వచ్చాడని, గత మూడు రోజులగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడని చెప్పారు. దీనిపై ఎస్సై నారాయణాస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News September 18, 2025
ఎచ్చెర్ల: పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో B.Ed 1, 3వ, B.PEd 1వ సెమిస్టర్ల పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ నేడు ఫలితాలను విడుదల చేశారు. యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ https://brau.edu.in/లో ఫలితాలను అభ్యర్థులు చూడవచ్చునన్నారు.
News September 18, 2025
టెక్కలి: గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా అధికారి

టెక్కలి శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకర్రావు గురువారం పరిశీలించారు. స్థానిక అధికారిణి రూపావతితో పలు అంశాలపై మాట్లాడిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన సెస్ బకాయిలు వస్తే గ్రంథాలయాల అభివృద్ధికి దోహద పడతాయన్నారు. అనంతరం పాఠకులతో మాట్లాడారు.