News March 13, 2025

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ధ్రువీకరణ పత్రం

image

ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గురువారం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News April 7, 2026

నల్గొండలో 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో ఈ నెల 20 నుంచి మే 5 వరకు పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO బిక్షపతి తెలిపారు. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు, ప్రాక్టికల్స్ ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు జరుగుతాయని తెలిపారు. మొత్తం 3,837 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. దేవరకొండ, మిర్యాలగూడ, నల్గొండల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News April 7, 2026

NLG: ప్రశాంతంగా జీవశాస్త్రం పరీక్ష.. 41 మంది గైర్హాజరు

image

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ బిక్షపతి తెలిపారు. మొత్తం 106 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు సాధారణ విద్యార్థులు 19,698 మందికి గానూ 19,663 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 103 మందికి గానూ 97 మంది రాశారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 41 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.

News April 7, 2026

NLG: యాచారంలో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్

image

అనుముల మండలం యాచారంలో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 14 వేల ఎకరాల్లో సాగు ఉండగా, ప్రస్తుతం 2,500 ఎకరాల్లో పంట కోత దశకు చేరింది. రైతులకు రవాణా ఖర్చులు తగ్గించి, ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ మిల్లును నిర్మిస్తున్నారు. ప్రాథమికంగా గంటకు 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభించి, భవిష్యత్తులో దీనిని 120 టన్నులకు విస్తరించనున్నారు.