News November 5, 2025
ఎరవల్లి: 108 అంబులెన్స్లో మహిళ ప్రసవం

పురిటి నొప్పులతో 108 వాహనంలోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన ఎర్రవల్లి మండలం యాక్తాపురంలో చోటుచేసుకుంది. ఎర్రవల్లి మండలం యాక్తాపురంలో గ్రామానికి చెందిన ఆసియాకు పురిటి నొప్పులు అధికం కావడంతో బంధువులు 108 ఫోన్ చేశారు. సకాలంలో స్పందించిన అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకోని గర్భిణీని హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికం కావడంతో 108లోనే సురక్షితంగా డెలివరీ చేశారు.
Similar News
News November 5, 2025
మెదక్: కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు

రామాయంపేట మండల కేంద్రంలోని KGBV నిజాంపేటలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ప్రత్యేక అధికారిని రాణి తెలిపారు. వంట మనిషి, సహాయం వంటమనిషి, వాచ్మెన్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 18 నుంచి 45 సంవత్సరాల మహిళలు ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 5, 2025
ఇలా అయితే థియేటర్లు ఖాళీ అవుతాయ్: సుప్రీం

మూవీ టికెట్తో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం ఒక సినిమాకి ₹1,500 నుంచి ₹2,000కు ఖర్చవుతుంది. ధరలను నియంత్రించకపోతే సినిమా హాళ్లు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉంది’ అని కోర్టు పేర్కొంది. కర్ణాటకలో మూవీ టికెట్ ధరను రూ.200కు పరిమితం చేయడంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంను ఆశ్రయించగా ఈ విధంగా స్పందించింది.
News November 5, 2025
వరిని ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి పంట కోసిన తర్వాత పనల మీద గింజలు కొంత వరకు ఎండుతాయి. తూర్పారబట్టి శుభ్రపరచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమను 12-14%కు తగ్గించాలి. అయితే ధాన్యంలో తేమ ఒక్కసారిగా తగ్గకూడదు. క్రమక్రమంగా తగ్గాలి. దీని కోసం సాధారణమైన ఎండలో ధాన్యాన్ని పరిచి మధ్యమధ్యలో తిరగతిప్పాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరబెడితే గింజల్లో తేమ ఒక్కసారిగా తగ్గి గింజలపై పగుళ్లు వచ్చి.. ధాన్యం మిల్లింగ్ సమయంలో నూకలయ్యే అవకాశం ఎక్కువ.


